Vizag: విశాఖకు చేరుకున్న ఢిల్లీ, సీఎస్‌కే టీమ్స్

  • శుక్రవారం వైజాగ్‌కు చేరుకున్న ఢిల్లీ, సీఎస్‌కే టీమ్స్
  • వైజాగ్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం
  • క్రికెటర్లతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డ అభిమానులు
  • పీఎంపాలెం స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్
CSK delhi arrives in vizag ahead of ipl match

వైజాగ్ వేదికగా ఢిల్లీ, సీఎస్‌కే మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో రెండు జట్లు శుక్రవారం నగరానికి చేరుకున్నాయి. విశాఖ విమానాశ్రయంలో జట్టు సభ్యులకు అద్భుత స్వాగతం లభించింది. ఎమ్.ఎస్ ధోనీతో పాటు ఇతర క్రికెటర్లతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు అమితోత్సాహం చూపించారు. అనంతరం, జట్టు సభ్యులు ప్రత్యేక బస్సుల్లో నగరంలోకి వెళ్లారు. పీఎంపాలెం స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.

More Telugu News