Congress: బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీని పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ నేత

  • ఫిలిబిత్ నుంచి వరుణ్ గాంధీకి టిక్కెట్ నిరాకరించిన బీజేపీ
  • ఆయన మూలాలు గాంధీ కుటుంబంతో ముడిపడి ఉండటం వల్లే బీజేపీ టిక్కెట్ ఇవ్వలేదన్న కాంగ్రెస్ నేత
  • కాంగ్రెస్‌లోకి వస్తే ఆనందిస్తామన్న అధిర్ రంజన్ చౌదరి
Adhir Ranjan Chowdhury after BJP denies him ticket

బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీని కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. బీజేపీ ఆయనకు ఫిలిబిత్ నుంచి టిక్కెట్ నిరాకరించింది. ఆయన స్థానంలో ఉత్తర ప్రదేశ్ మంత్రి జితిన్ ప్రసాదకు టిక్కెట్ కేటాయించింది. వరుణ్ గాంధీ కొన్నాళ్లుగా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దీంతో ఆయనకు బీజేపీ టిక్కెట్ దక్కలేదు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి మంగళవారం మాట్లాడుతూ... వరుణ్ గాంధీ వస్తే తాము స్వాగతిస్తామన్నారు. ఆయన మూలాలు గాంధీ కుటుంబంతో ముడిపడి ఉండటం వల్లే బీజేపీ టిక్కెట్ నిరాకరించిందని ఆరోపించారు.

'వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లోకి రావాలి. అప్పుడు మేం ఎంతో ఆనందిస్తాం. అతను చదువుకున్న వ్యక్తి. అలాగే క్లీన్ ఇమేజ్ ఉంది. కానీ గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి కాబట్టి బీజేపీ టిక్కెట్ నిరాకరించింది. అందుకే అతను రావాలని (కాంగ్రెస్) నేను భావిస్తున్నాను' అని అధిర్ రంజన్ అన్నారు. ఫిలిబిత్ నుంచి వరుణ్ గాంధీ 2009, 2019లో విజయం సాధించారు. ఆయన రెండుసార్లు బీజేపీ నుంచే గెలిచారు. 1989లో మేనకా గాంధీ జనతాదళ్ నుంచి గెలిచారు. 1991లో ఇక్కడ బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. ఆ తర్వాత 2004లో, 2014లో మేనకా గాంధీ ఇక్కడి నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి గెలిచారు.

More Telugu News