Naveen Chandra: అడవిలో హత్యలకు దెయ్యమే కారణమా?: ఉత్కంఠను పెంచుతున్న 'ఇన్ స్పెక్టర్ రిషి' సిరీస్

  • నవీన్ చంద్ర హీరోగా 'ఇన్ స్పెక్టర్ రిషి'
  • హారర్ టచ్ తో నడిచే క్రైమ్ థ్రిల్లర్
  • అడవి నేపథ్యంలో నడిచే కథ 
  • ఈ నెల 29 నుంచి  అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్
Inspector RishiWeb Series Update

ఒక వైపున సినిమాలు చేస్తూనే మరో వైపున వెబ్ సిరీస్ లతో నవీన్ చంద్ర బిజీగా ఉన్నాడు. ఆయన నుంచి ప్రేక్షకుల ముందుకు రావడానికి మరో సిరీస్ రెడీ అవుతోంది. ఆ సిరీస్ పేరే 'ఇన్ స్పెక్టర్ రిషి'. ఈ సిరీస్ లో టైటిల్ రోల్ లో నవీన్ చంద్ర కనిపించనున్నాడు. సుఖ్ దేవ్ లాహిరి నిర్మించిన ఈ సిరీస్ కి, నందిని దర్శకత్వం వహించారు. తమిళంలో రూపొందిన ఈ సిరీస్ ను ఈ నెల 29వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. 

తమిళంతో పాటు తెలుగు .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సిరీస్ ను అందుబాటులోకి తెస్తున్నారు. ఒక వైపున హారర్ థ్రిల్లర్ .. మరో వైపున సూపర్ నేచురల్ థ్రిల్లర్ కలిసిన ఒక విలక్షణమైన జోనర్ ఇది. సీబీ  సీఐడీ ఆఫీసర్ గా నవీన్ చంద్ర నటించిన ఈ సిరీస్ లో, సునైన .. కన్నారవి .. శ్రీకృష్ణ దయాళ్ .. జీవరత్నం .. కుమార్ వేల్ ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. 

ఒక అటవీప్రాంతంలో వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. ఆ కేసు విషయంపై ఆ ప్రాంతానికి ఇన్ స్పెక్టర్ రిషి వస్తాడు. అడవిలో తిరుగుతున్న ఒక దెయ్యం ఈ హత్యలకు కారణమని అక్కడి గిరిజనులు చెబుతారు. వాళ్ల మాటల్లో నిజం లేదని భావించిన రిషి, తన టీమ్ తో కలిసి అడవిలోకి వెళతాడు. అక్కడ అతనికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? అప్పుడు అతను ఏం చేస్తాడు? అనేదే కథ.

More Telugu News