Bhadradri Ramaiah: శ్రీరామ నవమి రోజున భద్రాద్రి రామయ్య కల్యాణాన్ని కనులారా వీక్షించాలనుకుంటున్నారా?.. బుక్ చేసుకోండిలా!

  • ఏప్రిల్ 17న శ్రీరామ నవమి
  • సెక్టార్ టికెట్లను నేటి నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచిన దేవస్థానం
  • ఏప్రిల్ 1 నుంచి నేరుగానూ కొనుగోలు చేసుకోవచ్చు
Bhadradri Ramaiah Temple Released Online Ticket For Kalyanam

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో ఏప్రిల్ 17న శ్రీరామ నవమిని పురస్కరించుకుని కల్యాణం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రాములోరి కల్యాణాన్ని కనులారా వీక్షించాలనుకునే భక్తుల కోసం నేటి నుంచి సెక్టార్ టికెట్లను దేవస్థానం అందుబాటులోకి ఉంచింది. శ్రీరామ నవమి రోజున ఉభయ దాతల టికెట్ రుసుమును రూ. 7,500గా పేర్కొంది. ఈ టికెట్ ద్వారా ఇద్దరికి ప్రవేశం ఉంటుంది. అలాగే, రూ. 2500, రూ. 2000, రూ. 1000, రూ. 300, రూ. 150 టికెట్లను కూడా అందుబాటులో ఉంచింది. ఈ టికెట్లపై ఒక్కరికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. 18న పట్టాభిషేకం కోసం రూ. 1500, రూ. 500, రూ.100 టికెట్లను ప్రకటించింది. వీటిని https://bhadradritemple.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి పొందవచ్చు. కల్యాణం రోజున రావడం వీలుకాని భక్తులు రూ. 5 వేలు, రూ. 116 టికెట్లతో పరోక్ష పద్ధతిలో గోత్రనామాలతో పూజ చేయించుకోవచ్చు. ఈ టికెట్లు కూడా వెబ్‌సైట్‌ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న వారు ఏప్రిల్ 1 నుంచి 17 వరకు ఉదయం ఆరు గంటల నుంచి రామాలయ కార్యాలయం (తానీషా కల్యాణ మండపం)లో ఒరిజినల్ ఐడీ కార్డులు చూపించి టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. నేరుగా టికెట్లు కొనుగోలు చేయాలనుకున్న వారు ఏప్రిల్ 1 నుంచి భద్రాచలం రామాలయం, తానీషా కల్యాణ మండపం, గోదావరి బ్రిడ్జ్ సెంటర్‌లోని ఆలయ విచారణ కేంద్రం, ఆర్డీవో కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో నేరుగా విక్రయించనున్నారు.

More Telugu News