లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న స్మగ్లర్ వీరప్పన్ కూతురు
- నాలుగేళ్ల క్రితం బీజేపీలో చేరిన విద్యారాణి వీరప్పన్
- ఆమెకు ఎలాంటి పదవిని ఇవ్వని బీజేపీ నాయకత్వం
- నామ్ తమిళర్ కట్చి పార్టీలో చేరిన విద్యారాణి
విద్యారాణి నాలుగేళ్ల క్రితం బీజేపీలో చేరారు. నాలుగేళ్లుగా ఆమె పార్టీలో ఉన్నా... బీజేపీ నాయకత్వం ఆమెకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. దీంతో చాలా కాలంగా ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె బీజేపీకి రాజీనామా చేసి నామ్ తమిళర్ కట్చి పార్టీలో చేరారు. రానున్న ఎన్నికల్లో నామ్ తమిళర్ కట్చి పార్టీ తమిళనాడులోని 39 లోక్ సభ స్థానాలతో పాటు పుదుచ్చేరి స్థానంలో కూడా పోటీ చేస్తోంది.