Janasena: మరో 11 మంది అభ్యర్థులను ఖరారు చేసిన పవన్ కల్యాణ్... జనసేన జాబితా విడుదల

  • ఏపీలో 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్న జనసేన
  • ఇప్పటివరకు 18 మంది అసెంబ్లీ అభ్యర్థుల ఖరారు
  • పెండింగ్ లో అవనిగడ్డ, విశాఖ సౌత్, పాలకొల్లు నియోజకవర్గాలు
Pawan Kalyan confirmed another 11 candidates for assembly elections

ఏపీలో పొత్తు కారణంగా జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాల్లో, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇప్పటివరకు 7 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, ఇవాళ మరో 11 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. తద్వారా జనసేన పార్టీ ఇప్పటివరకు 18 మంది అభ్యర్థులను ఖరారు చేసినట్టయింది. ఇంకా, విశాఖపట్నం సౌత్, పాలకొండ, అవనిగడ్డ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. తొలుత 5 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన జనసేనాని, నిన్న మరో ఇద్దరిని ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అటు, కాకినాడ లోక్ సభ స్థానానికి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేరును ప్రకటించారు.

More Telugu News