AP Governor: అస్వస్థతకు గురైన ఏపీ గవర్నర్ నజీర్... వెంటనే ఆసుపత్రికి తరలించిన భద్రతా సిబ్బంది

  • గవర్నర్ నజీర్ కు ఒక్కసారిగా అస్వస్థత
  • మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స
  • నిలకడగా గవర్నర్ ఆరోగ్యం
AP Governor hospitalised

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయనను భద్రతా సిబ్బంది వెంటనే విజయవాడ మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు గవర్నర్ కు చికిత్స అందిస్తున్నారు. గవర్నర్ అనారోగ్యానికి కారణాలు ఏంటన్నది తెలియరాలేదు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News