Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • 540 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 173 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 3.55 శాతం పెరిగిన ఎన్టీపీసీ షేరు విలువ
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ సానుకూలతలు మార్కెట్లకు అండగా నిలిచాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 540 పాయింట్లు లాభపడి 72,641కి చేరుకుంది. నిఫ్టీ 173 పాయింట్లు పెరిగి 22,011 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (3.55%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (3.40%), టాటా స్టీల్ (2.99%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.93%), టాటా మోటార్స్ (2.57%). 

టాప్ లూజర్స్:
భారతి ఎయిర్ టెల్ (-0.83%), ఐసీఐసీఐ బ్యాంక్ (-0.24%), మారుతి (-0.23%), ఏసియన్ పెయింట్స్ (-0.06%).

More Telugu News