Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం... రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి బదిలీ!

  • మొత్తం 27 మంది జడ్జిల బదిలీ
  • నాగ్‌పాల్ స్థానంలో న్యాయమూర్తి కావేరీ బవేజా నియామకం
  • మద్యం పాలసీ కేసు ప్రారంభం నుంచి విచారణ జరుపుతున్న జడ్జి నాగ్‌పాల్

ఢిల్లీ మద్యం కేసు అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించిన కేసులను విచారిస్తున్న రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి (పీసీ యాక్ట్) ఎంకే నాగ్‌పాల్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో న్యాయమూర్తి కావేరీ బవేజా నియమితులయ్యారు. న్యాయమూర్తి నాగ్‌పాల్.... తీస్ హజారీ కోర్టు జిల్లా న్యాయమూర్తి (వాణిజ్య న్యాయస్థానం)గా బాధ్యతలు చేపట్టనున్నారు.

జడ్జి నాగ్‌పాల్ మద్యం పాలసీ కేసును ప్రారంభం నుంచి విచారిస్తున్నారు. ఈ కేసులో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తదితర ప్రముఖులు అరెస్ట్ అయ్యారు. సిసోడియా, సంజయ్ సింగ్ జ్యూడిషియల్ రిమాండ్ లో ఉండగా, కవిత ఈడీ రిమాండ్‌లో ఉన్నారు.

ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన బదిలీ పోస్టింగ్ జాబితా ప్రకారం... ఢిల్లీ హయ్యర్ జ్యుడీషియల్ సర్వీసెస్‌కు చెందిన మొత్తం 27 మంది న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. ఇందులో న్యాయమూర్తి నాగ్‌పాల్ ఒకరు. మరోవైపు, ఢిల్లీ జ్యుడీషియల్ సర్వీసెస్‌కు చెందిన 31 మంది న్యాయమూర్తులు కూడా బదిలీ అయ్యారు.

More Telugu News