goshamahal: కాంగ్రెస్ పార్టీలో చేరిన గోషామహల్ బీఆర్ఎస్ ఇంచార్జ్ నందకిషోర్ వ్యాస్

  • రాజీనామా లేఖను కేటీఆర్‌కు పంపించిన నందకిషోర్ వ్యాస్
  • రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న బీఆర్ఎస్ నేత
  • గోషామహల్‌లో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తానని వ్యాఖ్య
Goshamahal Incharge NandaKishor Resigned BRS Joined Congress

గోషామహల్ బీఆర్ఎస్ ఇంచార్జ్ నందకిషోర్ వ్యాస్ ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో శనివారం కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. గోషామహల్‌లో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకు వస్తామని ఈ సందర్భంగా నందకిషోర్ వ్యాస్ పేర్కొన్నారు. అంతకుముందు, ఆయన తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు పంపించారు. గోషామహల్ నుంచి ఆయన పలుమార్లు పోటీ చేసి ఓడిపోయారు. 2014లో స్వతంత్ర అభ్యర్థిగా, 2023లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. ఈ రెండుసార్లు ఆయన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేతిలో ఓటమి చవిచూశారు.

More Telugu News