Praja Galam: ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ ల ఫొటోలతో రూపొందిన 'ప్రజాగళం' లోగో విడుదల

  • ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తు
  • కూటమిగా ఎన్నికల బరిలో దిగుతున్న మూడు పార్టీలు
  • ఈ నెల 17న చిలకలూరిపేట సభలో శంఖారావం పూరించనున్న అగ్రనేతలు
  • సభకు హాజరవుతున్న ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్
  • సభకు ప్రజాగళం అని నామకరణం 
Praja Galam logo released

ఏపీలో పొత్తు కుదర్చుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఉమ్మడి సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద ఈ నెల 17న సాయంత్రం 4 గంటలకు ఈ భారీ బహిరంగ సభ జరగనుంది.  

మూడు పార్టీలు ఏర్పాటు చేసిన ఈ సభకు 'ప్రజాగళం' అని నామకరణం చేశారు. తాజాగా ఈ సభ లోగోను విడుదల చేశారు. మధ్యలో ప్రధాని మోదీ, ఆయనకు ఇరువైపులా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉండడాన్ని ఈ లోగోలో చూడొచ్చు. 

ప్రజాగళం సభ ద్వారా మోదీ, చంద్రబాబు, పవన్ ఒకే వేదికపైకి రానున్నారు. లక్షలాది మంది వస్తారన్న అంచనాల నేపథ్యంలో 100కి పైగా ఎకరాల్లో ఈ సభ ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేతృత్వంలో 13 కమిటీలు ఈ సభా నిర్వహణలో పాలుపంచుకున్నాడు.

More Telugu News