నాకు ప్రజాతీర్పు కావాలి అంటున్న నీ చెల్లికి సమాధానం చెప్పే ధైర్యం ఉందా జగన్?: దేవినేని ఉమ

  • హూ కిల్డ్ బాబాయ్ అంటే ఐదేళ్లుగా సమాధానం లేదన్న దేవినేని ఉమ
  • వివేకా హత్య గురించి జగన్ కు ముందే తెలుసని వ్యాఖ్య
  • న్యాయం అడిగితే నేరం మోపాలనుకున్నారని విమర్శ
హూ కిల్డ్ బాబాయ్ అంటే ఐదేళ్లుగా సమాధానం లేదని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. బాబాయిని చంపి తప్పుడు ప్రచారంతో రాజకీయ లబ్ధి పొందారని సీఎం జగన్ పై మండిపడ్డారు. అధికార దుర్వినియోగంతో కేసు నీరు కార్చాలని చూశారని అన్నారు. హత్య గురించి జగన్ రెడ్డికి ముందే తెలుసని.. హంతకులు మన మధ్య ఉన్నా గుర్తించలేకపోయామని.. న్యాయం అడిగితే నేరం మోపాలనుకున్నారని దుయ్యబట్టారు. జగనన్న పాలనలో న్యాయం జరగదని అన్నారు. నాకు ప్రజాతీర్పు కావాలి అంటున్న నీ చెల్లెలు సునీతకు సమాధానం చెప్పే ధైర్యం ఉందా? అని జగన్ ను ప్రశ్నించారు. మరోవైపు వివేకా ఐదో వర్ధంతిని కుటుంబ సభ్యులు జరుపుకున్నారు. పులివెందులలో వివేకా సమాధి వద్ద ఆయనకు వైఎస్ సునీత నివాళి అర్పించారు.

Devineni Uma
Telugudesam
YS Jagan
YSRCP
YS Vivekananda Reddy
AP Politics

More Telugu News