Electoral Bond Donors: ఎలక్టోరల్ బాండ్స్.. పార్టీలకు భారీగా నిధులు ఇచ్చిన కార్పొరేట్ సంస్థలు ఇవే!

  • సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈసీకి ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు సమర్పించిన ఎస్బీఐ
  • బాండ్స్ వివరాలను గురువారం ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ఈసీ
  • 2019 ఏప్రిల్ 12 నుంచి 2024 ఫిబ్రవరి 15 వరకూ డేటా సమర్పించిన ఎస్బీఐ
Electoral bonds Top 10 donors to political parties

ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా పార్టీలకు విరాళాలిచ్చిన దాతల వివరాలను ఎలక్షన్ కమిషన్ (ఈసీ) గురువారం తన వెబ్‌సైట్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచింది. ఈ సమాచారాన్ని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ ఈసీకి అందించిన విషయం తెలిసిందే. పారదర్శకత కోసం ఈ వివరాలను ప్రజల ముందు ఉంచాలన్నదే తమ అభిమతమని ఈసీ గతంలోనే సుప్రీం కోర్టుకు తెలియజేసింది. ఈసీ వివరాల ప్రకారం పార్టీలకు భారీ విరాళాలు ఇచ్చిన టాప్ 10 దాతలు వీరే...

  • ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ పీఆర్ - రూ.1368 కోట్లు
  • మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ - రూ.966 కోట్లు
  • క్విక్ సప్లై చైన్ ప్రైవేట్ లిమిటెడ్ - రూ. 410 కోట్లు
  • వేదాంత లిమిటెడ్ - రూ. 400 కోట్లు
  • హల్దియా ఎనర్జీ లిమిటెడ్ - రూ 377 కోట్లు
  • భారతీ గ్రూప్ - రూ. 247 కోట్లు
  • ఎస్సెల్ మైనింగ్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ - రూ. 224 కోట్లు
  • వెస్టర్న్ యూపీ పవర్ ట్రాన్స్‌మిషన్ కంపెనీ లిమిటెడ్ - రూ. 220 కోట్లు
  • కెవెంటర్ ఫుడ్‌పార్క్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ - రూ. 195 కోట్లు
  • మదన్‌లాల్ లిమిటెడ్ - రూ.185 కోట్లు

2019 ఏప్రిల్ 12 నుంచి 2024 ఫిబ్రవరి 15 వరకూ ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోళ్ల వివరాలను ఈసీకి ఇచ్చినట్టు ఎస్బీఐ వెల్లడించింది. ఈ కాలంలో మొత్తం 22,217 బాండ్ల కొనుగోళ్లు జరిగాయని సుప్రీంకోర్టుకు తెలిపింది.

More Telugu News