పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన పారిశ్రామికవేత్త గంటా నరహరి
- గంటా నరహరికి జనసేన కండువా కప్పిన పవన్ కల్యాణ్
- జనసేన పార్టీలోకి సాదర స్వాగతం
- 2022లో టీడీపీలో చేరిన గంటా నరహరి
గంటా నరహరి గతంలో టీడీపీలో కొనసాగారు. 2022లో చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. దివంగత మాజీ ఎంపీ డీకే ఆదికేశవులు నాయుడుకు గంటా నరహరికి బంధుత్వం ఉంది.
బెంగళూరు కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న గంటా నరహరి 2017-18లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ యువ పారిశ్రామికవేత్త పురస్కారం అందుకున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో నరహరి తిరుపతి టికెట్ ఆశిస్తున్నట్టు ప్రచారంలో ఉంది.