Crime News: క‌ర్నూలులో దారుణం.. కూతురు గొంతుకోసి చంపేసిన తండ్రి!

  • కోసిగి మండ‌లం జంపాపురంలో ఘ‌ట‌న‌
  • మూడేళ్ల చిన్నారి గొంతు కోసిన‌ తండ్రి శాంతి కుమార్ 
  • మ‌ద్యం మ‌త్తులో దారుణానికి పాల్ప‌డిన నిందితుడు
  • భార్య ఫిర్యాదుతో శాంతి కుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Father Killed 3 Year old Daughter in Kurnool District

క‌ర్నూలు జిల్లాలో దారుణం జ‌రిగింది. క‌న్న‌కూతురును గొంతుకోసి చంపేశాడో క‌సాయి తండ్రి. కోసిగి మండ‌లం జంపాపురంలో ఈ దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారిని తండ్రి శాంతి కుమార్ గొంతు కోసి చంపేశాడు. బుధ‌వారం ఉద‌యం త‌ల్లి ప‌క్క‌న ప‌డుకున్న పాప‌ను అతి కిరాత‌కంగా గొంతు కోసి క‌డ‌తేర్చాడు. మ‌ద్యానికి బానిసైన శాంతికుమార్ కొంత‌కాలంగా సైకోగా ప్ర‌వ‌ర్తిస్తున్న‌ట్లు తెలిసింది. పూటుగా మ‌ద్యం తాగొచ్చి భార్య‌ను చిత్ర‌హింస‌లకు గురి చేస్తున్నాడు. 

ఈ క్ర‌మంలో ఇవాళ ఉద‌యం చిన్నారిని గొంతు కోసి చంపేశాడు. నిద్ర‌లేచి చూసేస‌రికి కూతురు ర‌క్త‌పుమ‌డుగులో ప‌డి ఉండ‌డంతో త‌ల్లి సంపూర్ణ పోలీసుల‌కు స‌మాచారం అందించింది. దీంతో ఘ‌ట‌నాస్థ‌లికి వ‌చ్చిన పోలీసులు శాంతి కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, నిందితుడి సొంత ఊరు మంత్రాల‌యం మండ‌లం క‌గ్గ‌ళ్లు గ్రామం అని తెలిసింది. జంపాపురంలో ఇల్ల‌రికం అల్లుడిగా వెళ్లాడు. ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం సృష్టించింది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News