Stock Market: నిన్నటి భారీ నష్టాల నుంచి కోలుకున్న మార్కెట్లు

  • 165 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 3 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 2.30 శాతం లాభపడ్డ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు 
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్నటి భారీనష్టాల నుంచి కోలుకుని, నేడు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 165 పాయింట్లు లాభపడి 73,668కి చేరుకుంది. నిఫ్టీ 3 పాయింట్లు పెరిగి 22,336 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.30%), టీసీఎస్ (1.69%), మారుతి (0.92%), ఇన్ఫోసిస్ (0.80%), రిలయన్స్ (0.65%). 

టాప్ లూజర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.82%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-1.47%), ఐటీసీ (-1.26%), టాటా మోటార్స్ (-1.11%), నెస్లే ఇండియా (-0.89%). 

అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 82.78గా ఉంది.

More Telugu News