మాల్దీవుల నుంచి తొలి విడత భారత సైనికుల బృందం ఉపసంహరణ
- అడ్డూ నగరం నుంచి 25 మంది సైనికుల బృందం వెళ్లిపోయిందన్న మాల్దీవుల మీడియా
- నిర్ధారించిన మాల్దీవుల నేషనల్ డిఫెన్స్ ఫోర్స్
- మే 10 లోగా అక్కడి నుంచి వచ్చేయనున్న మిగతా భారత సైనిక బృందం
మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద ముయిజ్జు చైనా అనుకూల వైఖరి కారణంగా భారత సైనిక సిబ్బందిని ఆ దేశం నుంచి ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ముయిజ్జు అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే భారత సైనిక సిబ్బంది దేశం విడిచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. మే 10 లోగా ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. దీంతో గడువులోగా మిగతా సైనిక బృందం కూడా అక్కడి నుంచి వచ్చేయనుంది. కాగా మాల్దీవులకు భారత్ ఒక డోర్నియర్ 228 సముద్ర గస్తీ విమానం, రెండు హెచ్ఏఎల్ ధ్రువ్ హెలికాప్టర్లను సాయంగా అందించింది. అంతేకాదు 88 మంది సైనిక సిబ్బందితో ఆ దేశానికి చాలా కాలం సేవలు కూడా అందించింది.