TDP-JanaSena-BJP Alliance: ఈ నెల 17న చిలకలూరిపేట వద్ద టీడీపీ-జనసేన-బీజేపీ సభ... ఏర్పాట్లు పర్యవేక్షించనున్న లోకేశ్

  • ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఖరారు
  • ఉమ్మడిగా సమరశంఖం పూరించేందుకు ముహూర్తం ఖరారు
  • మార్చి 17న చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో భారీ సభ
  • సభ నిర్వహణ కోసం 13 కమిటీల ఏర్పాటు 
Nara Lokesh will supervise Chilakaluripet meeting

ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల మధ్య పొత్తు ఖరారైన నేపథ్యంలో... మూడు పార్టీలు ఉమ్మడిగా ఎన్నికల సమర శంఖం పూరించేందుకు ఈ నెల 17న ముహూర్తం ఖరారైంది. టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి సభ చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వద్ద నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభ ఏర్పాట్లను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యవేక్షించనున్నారు. ఉమ్మడి సభ నిర్వహణకు 13 కమిటీలను నియమించారు. మూడు పార్టీల్లోని నేతలతో ఈ కమిటీలు ఏర్పాటు చేశారు.
     

More Telugu News