Raghu Rama Krishna Raju: ఏపీ హైకోర్ట్ కి వచ్చిన రఘురామకృష్ణరాజు

  • వైసీపీ ప్రభుత్వ అవినీతిపై సీబీఐ చేత విచారణ జరిపించాలని రఘురాజు పిటిషన్
  • 19వ నెంబర్ హాల్లో 10వ ఐటెంగా రఘురాజు పిటిషన్
  • విచారణ నేపథ్యలో హైకోర్టుకు వచ్చిన రఘురాజు
Raghu Rama Krishna Raju in AP High Court

ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ హైకోర్టుకు వచ్చారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అవినీతిపై సీబీఐ చేత విచారణ జరిపించాలని కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ రోజు ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది. హైకోర్టులోని 19వ నెంబర్ హాల్లో 10వ ఐటెంగా రఘురాజు పిటిషన్ ఉంది. వైసీపీలో ఉంటూనే ఆయన సీఎం జగన్, వైసీపీపై విమర్శల దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ప్రభుత్వం వైపు నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ఆయన ఏపీకి రావడం ఆపేశారు. చాలా కాలం తర్వాత ఆయన మొన్న సంక్రాంతికి భీమవరం వెళ్లారు. ఈ తర్వాత ఈరోజు మళ్లీ ఏపీలో అడుగుపెట్టారు. రఘురాజు రావడంతో హైకోర్టు వద్ద సందడి నెలకొంది. 

More Telugu News