CM Revanth Reddy: రేపు యాదాద్రి వెళుతున్న సీఎం రేవంత్ రెడ్డి

  • యాదాద్రిలో సోమవారం నుంచి బ్రహ్మోత్సవాలు
  • తొలి రోజున స్వస్తి పూజల్లో పాల్గొననున్న రేవంత్ రెడ్డి
  • అనంతరం భద్రాచలం పయనం
CM Revanth Reddy visits Yadadri tomorrow

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు (మార్చి 11) యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి యాదాద్రిలో పర్యటిస్తుండడం ఇదే తొలిసారి. సోమవారం నుంచి యాదాద్రి గుట్టపై లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 21 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. రేపు బ్రహ్మోత్సవాల తొలి రోజున జరిగే స్వస్తి పూజలలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఆరుగురు మంత్రులు కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. లక్ష్మీనరసింహస్వామి దర్శనం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి నుంచి భద్రాచలం పయనమవుతారు.

More Telugu News