Chandrababu: ఢిల్లీలో ముగిసిన చంద్రబాబు, పవన్ పర్యటన

Chandrababu and Pawan Kalyan Delhi tour concluded
  • చంద్రబాబు, పవన్ ల ఢిల్లీ పర్యటన సక్సెస్
  • బీజేపీతో కుదిరిన పొత్తు
  • ఢిల్లీ నుంచి హైదరాబాద్ పయనం
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ల ఢిల్లీ పర్యటన విజయవంతం అయింది. బీజేపీతో పొత్తును ఖరారు చేసుకోవాలని ఢిల్లీ వెళ్లిన ఇరువురు నేతలు అనుకున్న కార్యాన్ని జయప్రదం చేశారు. టీడీపీ-జనసేన కూటమితో బీజేపీ పొత్తు ఖరారైందని నేడు ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల ఢిల్లీ పర్యటన నేటితో ముగిసింది. వారిద్దరూ ఢిల్లీ నుంచి హైదరాబాద్ పయనమయ్యారు. బీజేపీతో పొత్తు కుదిరిన నేపథ్యంలో ఏపీలో టీడీపీ, జనసేన శ్రేణుల్లో ఉత్సాహం పెల్లుబుకుతోంది. తదుపరి కార్యాచరణపై త్వరలోనే టీడీపీ, జనసేన, బీజేపీ రాష్ట్ర నాయకత్వాలు ఉమ్మడి ప్రకటన చేయనున్నాయి.
Chandrababu
Pawan Kalyan
Delhi
TDP
Janasena
BJP
Andhra Pradesh

More Telugu News