లోయలో పడి తెలుగు వైద్యురాలి మృతి.. ఆస్ట్రేలియాలో దుర్ఘటన
- రాయల్ బ్రిస్బేన్ ఆసుపత్రిలో పనిచేస్తున్న వేమూరు ఉజ్వల
- ఈ నెల 2న స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్కు వెళ్లిన వైనం
- ప్రమాదవశాత్తూ కాలు జారడంతో లోయలో పడి దుర్మరణం
- మృతదేహాన్ని భారత్కు తరలించేందుకు కుటుంబసభ్యుల ఏర్పాట్లు
ఈ నెల 2వ తేదీన సరదాగా తోటి స్నేహితులతో కలిసి ఉజ్వల ట్రెక్కింగ్కు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ కాలు జారడంతో లోయలో పడి దుర్మరణం చెందారు. జీవితంలో ఉన్నత స్థితికి వెళుతుందనుకున్న ఉజ్వల ఇలా ఊహించని విధంగా దూరమవడం ఆమె కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కాగా, ఉజ్వల అంత్యక్రియల నిమిత్తం ఆమె భౌతిక కాయాన్ని ఉంగుటూరు మండలం ఎలుకపాడులోని అమ్మమ్మ, తాతయ్యల ఇంటికి తీసుకొస్తున్నారు.