TDP-Janasena: అమిత్ షా నివాసానికి చేరుకున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్

  • మలుపు తిరగనున్న ఏపీ రాజకీయ పరిణామాలు
  • ఢిల్లీలో అమిత్ షా నివాసంలో కీలక సమావేశం
  • అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు, పవన్ సమావేశం
  • ఈ సమావేశంలో పొత్తుపై స్పష్టత వచ్చే అవకాశం 
Chandrababu and Pawan Kalyan arrives Amit Shah residence in Delhi

ఏపీకి సంబంధించిన కీలక రాజకీయ పరిణామాలకు ఢిల్లీలోని కేంద్రమంత్రి అమిత్ షా నివాసం వేదికగా మారింది. టీడీపీ-జనసేన కూటమితో బీజేపీ భాగస్వామ్యం కోసం ప్రయత్నిస్తున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ హస్తినలో అమిత్ షా నివాసానికి చేరుకున్నారు. అమిత్ షాతో వారిరువురు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంతో ఏపీలో పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

More Telugu News