అమేథీ నుంచి రాహుల్ గాంధీ పోటీ!: యూపీ కాంగ్రెస్ నేత ప్రదీప్ సింఘాల్
- గత లోక్ సభ ఎన్నికల్లో స్మృతి ఇరానీ చేతిలో పరాజయంపాలైన రాహుల్ గాంధీ
- అమేథీ నుంచి త్వరలో రాహుల్ గాంధీ పేరును ప్రకటిస్తారని యూపీ కాంగ్రెస్ నేత వెల్లడి
- రాయ్బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారంటూ ప్రచారం
అమేథీ నుంచి రాహుల్ గాంధీ పేరును త్వరలో ప్రకటిస్తారని ప్రదీప్ సింఘాల్ తెలిపారు. అయితే పార్టీ అధిష్ఠానం నుంచి ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు బీజేపీ అమేథీ నుంచి ఈసారి కూడా స్మృతి ఇరానీనే బరిలోకి దింపుతోంది. ఇటీవల 195 అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో అమేథీ నుంచి స్మృతి ఇరానీకి మరోసారి అవకాశం కల్పించారు. ఇదిలా ఉండగా సోనియా గాంధీ స్థానమైన రాయ్బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీలో నిలిచే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.