మీ బిడ్డనంటున్నాడు.. జాగ్రత్త.. ప్రజలను హెచ్చరించిన లోకేశ్
- జగన్పై మరోమారు ధ్వజమెత్తిన లోకేశ్
- గత ఐదేళ్లలో జగన్ సొంత కంపెనీలు కళకళలాడుతుంటే రాష్ట్ర ఖజానా మాత్రం దివాలా తీసిందని ఆగ్రహం
- సచివాలయాన్ని రూ. 370 కోట్లకు, ఖనిజ సంపదను రూ. 7 వేల కోట్లకు తాకట్టు పెట్టారని మండిపాటు
- ఇక మిగిలింది ప్రజలేనని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక
సచివాలయాన్ని రూ. 370 కోట్లకు, ఖనిజ సంపదను రూ. 7 వేల కోట్లకు తాకట్టు పెట్టి అప్పు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మందుబాబులను ఇప్పటికే తాకట్టుపెట్టి రూ. 33 వేల కోట్ల అప్పు తెచ్చారని, జగన్ జమానాలో ఇక మిగిలింది 5 కోట్ల మంది ప్రజలు మాత్రమేనని పేర్కొన్నారు. ఇప్పుడేమో తాను మీ బిడ్డనేనని అంటున్నాడని, కాబట్టి ఆయన మాటల వెనక ఉన్న అర్థాన్ని గ్రహించి వచ్చే రెండు నెలలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్టు లోకేశ్ తెలిపారు.