Stock Market: ఒడిదుడుకుల మధ్య లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 66 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 27 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • మూడున్నర శాతం లాభపడ్డ ఎన్టీపీసీ షేర్లు
Stock markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. ఒడిదుడుకుల మధ్యే చివరకు లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 66 పాయింట్లు లాభపడి 73,872కి పెరిగింది. నిఫ్టీ 27 పాయింట్ల లాభంతో 22,405 వద్ద స్థిరపడింది. ఐటీ టెక్ సూచీలు ఈరోజు కూడా నష్టాలను మూటకట్టుకున్నాయి. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (3.50%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.63%), రిలయన్స్ (1.03%), బజాజ్ ఫిన్ సర్వ్ (0.94%), యాక్సిస్ బ్యాంక్ (0.90%). 

టాప్ లూజర్స్:     
జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-2.49%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.75%), టాటా స్టీల్ (-1.32%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.32%), ఇన్ఫోసిస్ (-1.05%).

More Telugu News