Pavitranath: నాలుగు రోజులు అస్వస్థతతో ఉన్నా ఎవరికీ తెలియలేదు... పవిత్రనాథ్ విషాదాంతం

  • మొగలిరేకులు, చక్రవాకం సీరియళ్లతో గుర్తింపు తెచ్చుకున్న పవిత్రనాథ్
  • వైవాహిక జీవితంలో కలతలు
  • కొన్ని రోజుల కిందట కన్నుమూత
Actor Pavitranath death reasons

మొగలిరేకులు, చక్రవాకం ఫేమ్ టీవీ నటుడు పవిత్రనాథ్ కొన్నిరోజుల కిందట మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే, పవిత్రనాథ్ నాలుగు రోజులుగా అస్వస్థతతో ఉన్నప్పటికీ ఎవరికీ తెలియకపోవడం బాధాకరం. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండగా, ఆయనను ఆసుపత్రికి తరలించారు. గుండె వైఫల్యంతో కన్నుమూశారు. పవిత్రనాథ్ చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లడం పట్ల బుల్లితెర రంగంలో విషాద ఛాయలు అలముకున్నాయి. 

భార్య శశిరేఖతో ఆయనకు చాలాకాలంగా గొడవలు ఉన్నాయి. పవిత్రనాథ్ పై భార్య తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణలపై ఆయన మౌనంగానే ఉన్నారు. పవిత్రనాథ్ చాలాకాలంగా నటనకు దూరంగా ఉన్నారు. కొంతకాలంగా ఆయన తన బుల్లితెర మిత్రులను కూడా కలవకుండా ఉంటున్నట్టు తెలిసింది.

More Telugu News