కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల తరఫున కేటీఆర్ కృతజ్ఞతలు
- రక్షణ శాఖ భూముల్లో ఎలివేటర్ కారిడార్లకు అనుమతి ఇవ్వడంతో థ్యాంక్స్ చెప్పిన కేటీఆర్
- ఎలివేటెడ్ కారిడార్లు బీఆర్ఎస్ పదేళ్ల కష్టానికి ఫలితమన బీఆర్ఎస్ నేత
- కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్కైవేల నిర్మాణాన్ని ప్రారంభించాలని విజ్ఞప్తి
ఎలివేటెడ్ కారిడార్లు బీఆర్ఎస్ పదేళ్ల కష్టానికి ఫలితమన్నారు. రక్షణ శాఖ భూముల కోసం తాము అలుపెరగని పోరాటం చేసినట్లు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ కేంద్రమంత్రులకు పదుల సంఖ్యలో వినతులు ఇచ్చామన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుమతివ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్కైవేల నిర్మాణాన్ని ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.