Nayanthara: భర్త విఘ్నేశ్ ను అన్ ఫాలో చేసిన నయన్

  • ఇన్ స్టాలో ఇటీవలే చేరిన స్టార్ దంపతులు
  • ఇంతలోనే భర్త ఖాతాను అన్ ఫాలో చేసిన హీరోయిన్
  • పొరపాటో.. సాంకేతిక తప్పిదమో అంటున్న అభిమానులు
Nayantara Unfollowed Husband in Instagram

ప్రముఖ హీరోయిన్ నయనతార ఇటీవలే ఇన్ స్టాలో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నయన్ కు ఇన్ స్టాలో 78 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే, తాజాగా తన భర్త విఘ్నేశ్ శివన్ ను నయన్ ఇన్ స్టాలో అన్ ఫాలో చేసింది. పేరులో కూడా నయనతార అని మాత్రమే రాసుకుంది. దీని వెనక నయన్ ఉద్దేశమేంటనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పొరపాటున జరిగి ఉండొచ్చని కొందరు, సాంకేతిక తప్పిదం కావొచ్చని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

నయనతార, విఘ్నేశ్ దాదాపు ఏడేళ్లపాటు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. 2022 లో దాంపత్య జీవనంలోకి అడుగుపెట్టిన ఈ దంపతులకు ఇటీవలే కవల పిల్లలు పుట్టిన విషయం తెలిసిందే. ఈ పిల్లల ఫొటోలతోనే నయన్, విఘ్నేశ్ లు ఇన్ స్టాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ ఫొటో తమ పిల్లలను చూపిస్తూ పోస్ట్ చేశారు. కాగా, నయనతార .. ప్రస్తుతం ‘టెస్ట్‌’ సినిమాలో నటిస్తున్నారు. ఆర్‌.మాధవన్‌, సిద్ధార్థ్‌ ల కాంబినేషన్ లో ఎస్‌. శశికాంత్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

More Telugu News