Dhruv: స్టార్ హీరో వారసుడి జోడీగా మలయాళ బ్యూటీ!

  • ధృవ్ విక్రమ్ నుంచి మూడో సినిమా
  • 'కబడ్డీ' నేపథ్యంలో నడిచే కథ  
  • మార్చి 15వ తేదీ నుంచి సెట్స్ పైకి 
  • దర్శకుడిగా మారి సెల్వరాజ్ 
  • కథానాయికగా అలరించనున్న దర్శన రాజేంద్రన్

Dhruv 3rd movie update

తమిళంలో 'ఆదిత్య వర్మ' సినిమాతో విక్రమ్ తనయుడు ధృవ్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమా ఆశించినస్థాయిలో ఆడలేదు. ఆ తరువాత ఆయన చేసిన 'మహాన్' కూడా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తరువాత ఆయన సినిమా ఏ దర్శకుడితో ఉండనుంది? ఆ ప్రాజెక్టు ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని విక్రమ్ అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తన మూడో సినిమా కోసం ధృవ్ రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకి మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించనున్నాడు. 80 రోజులలో ఈ సినిమా షూటింగును పూర్తి చేయాలనే ఒక పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగుతున్నారు. 'కబడ్డీ' నేపథ్యంలో ఈ కథ నడవనుంది. ఈ ఆటకి సంబంధించిన శిక్షణ తీసుకోవడంలో ధృవ్ బిజీగా ఉన్నాడు. 

ఈ  సినిమాలో కథానాయికగా దర్శన రాజేంద్రన్ ను తీసుకున్నారు. 2015లోనే ఈ సుందరి తన కెరియర్ ను ప్రారంభించింది. ఆ తరువాత నుంచి తమిళ ... మలయాళ సినిమాలను చేస్తూ వెళుతోంది. 'కవన్' .. 'ఇరుంబు తిరై' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీని, ఈ సినిమా కోసం ఎంపిక చేశారు. మార్చి 15వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. 

More Telugu News