Taapsee: వచ్చే నెలలో ప్రియుడిని పెళ్లాడబోతున్న తాప్సీ

  • గత పదేళ్లుగా మథియాస్ తో డేటింగ్ లో ఉన్న తాప్సీ
  • డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్
  • రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరగనున్న వివాహం
Taapsee Pannu to marry boyfriend in March

సినీ సెలబ్రిటీలు వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటూ వైవాహిక బంధంలోకి అడుగు పెడుతున్నారు. ఇటీవలే రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ముద్దుగుమ్మ తాప్పీ వంతు వచ్చింది. తాప్సీ తన బోయ్ ఫ్రెండ్ మథియాస్ బోను పెళ్లాడబోతోంది. దశాబ్ద కాలంగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారు. సిక్కు, క్రిస్టియానిటీ రెండు సంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి జరగనున్నట్టు తెలుస్తోంది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో మార్చి నెలలో వివాహం జరగనున్నట్టు ఎన్డీటీవీ ఓ కథనంలో వెల్లడించింది. 

తాప్పీ ప్రియుడు మథియాస్ వివరాల్లోకి వెళ్తే... ఆయన డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్. ఇప్పుడు కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. 1998లో అంతర్జాతీయ కెరీర్ ను ప్రారంభించాడు. డబుల్స్ లో ఆయన నెంబర్ 1 ర్యాంకును సాధించాడు. ప్రస్తుతం ఇండియా డబుల్స్ టీమ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. 2012 ఒలింపిక్స్ లో డబుల్స్ లో సిల్వర్ మెడల్ గెలుపొందాడు. 2013 ప్రపంచ ఛాంపియన్ షిప్ లో కాంస్య పతకం సాధించాడు. 2013లో బాలీవుడ్ లో అడుగుపెట్టిన సమయంలో తాప్సీ, మథియాస్ రిలేషన్ ప్రారంభమయింది.

More Telugu News