Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Markets ends in profits

  • 305 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 76 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 2.78 శాతం లాభపడ్డ టాటా మోటార్స్ షేర్లు

నిన్న నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలను మూటకట్టుకున్నాయి. ఈ రోజు ట్రేడింగ్ లో ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ మధ్యాహ్నం తర్వాత లభించిన కొనుగోళ్ల మద్దతుతో చివరకు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 305 పాయింట్లు లాభపడి 73,095 వద్ద ముగిసింది. నిఫ్టీ 76 పాయింట్లు పెరిగి 22,198 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా మోటార్స్ (2.78%), టీసీఎస్ (2.56%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.78%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.65%), భారతి ఎయిర్ టెల్ (1.54%). 

టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-1.29%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.23%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.77%), యాక్సిస్ బ్యాంక్ (-0.55%), ఎన్టీపీసీ (-0.46%).

  • Loading...

More Telugu News