Suhas: 'ఆహా' ఫ్లాట్ ఫామ్ పైకి 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు'

  • ఈ నెల 2న విడుదలైన 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు'
  • గ్రామీణ నేపథ్యంలో నడిచే కథాకథనాలు 
  • థియేటర్స్ నుంచి వచ్చిన మంచి రెస్పాన్స్
  • మార్చి 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్  

Ambajipeta Marriage Band OTT release date confirmed

సుహాస్ హీరోగా రూపొందిన 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' సినిమా, ఈ నెల 2వ తేదీన థియేటర్లకు వచ్చింది. ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ సినిమాకి, దుష్యంత్ కటికినేని దర్శకత్వం వహించాడు. కథానాయికగా శివాని నగరం ఈ సినిమాతోనే పరిచయమైంది. గ్రామీణ నేపథ్యంలో నడిచే ఈ కథకి, ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. 

ఈ సినిమా ఎప్పుడు ఓటీటీ సెంటర్ కి వస్తుందా అని ఎదురుచూస్తున్నవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అలాంటి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 'ఆహా'వారు దక్కించుకున్నారు. మార్చి 1వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన విషయాన్ని తెలియజేస్తూ, కొంతసేపటి క్రితం పోస్టర్ ను రిలీజ్ చేశారు.

గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ ఇది. ఊరు మధ్యలో సెలూన్ షాప్ .. బ్యాండుమేళం నిర్వహించే హీరో, ప్రెసిడెంట్ చెల్లెలిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి కూడా అతనిని ఇష్టపడుతుంది. ఈ విషయం తెలిసిన ప్రెసిడెంట్, హీరోపై కోపంతో అతని అక్కను టార్గెట్ చేస్తాడు. అప్పుడు హీరో ఏం చేస్తాడు? అనేదే కథ. ఆసక్తికరంగా నడిచే ఈ సినిమాకి ఓటీటీ వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది చూడాలి. 

More Telugu News