TSPSC: గ్రూప్-1 పరీక్ష తేదీ ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ

  • జూన్ 9న ప్రిలిమినరీ నిర్వహించనున్నట్టు తాజాగా ప్రకటన 
  • ప్రస్తుతం కొనసాగుతున్న దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ
  • దరఖాస్తుల స్వీకరణకు మార్చి 14 చివరి తేదీ
TSPSC announces group 1 preliminary exam date

గ్రూప్-1 పరీక్షకు సంబంధించి టీఎస్‌పీఎస్‌సీ మరో కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల ప్రిలిమినరీ పరీక్షలను జూన్ 9న నిర్వహించనున్నట్టు ప్రకటించింది. పేపర్ లీకేజీతో పాటు ఇతర కారణాల వల్ల గత ప్రభుత్వం 2022లో ఇచ్చిన గ్రూప్ -1 నోటిఫికేషన్‌ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. నాటి నోటిఫికేషన్‌లో పోస్టులకు అదనంగా మరికొన్ని జోడించి తాజాగా మరో గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం వీటి దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. మార్చి 14న చివరి తేదీ.

కాగా, భూగర్భజలశాఖలో వివిధ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల పోస్టులకు నిర్వహించిన రాత పరీక్ష జనరల్ ర్యాంకు జాబితాను కూడా టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఈ లిస్టును వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తరువాత ప్రకటిస్తామని పేర్కొంది.

More Telugu News