Mammootty: ఈ శుక్రవారం థియేటర్స్ లో దిగిపోయే సినిమాలివే!

  • ఈ నెల 23న చిన్న సినిమాల సందడి 
  • బరిలోకి దిగుతున్న తమిళ .. మలయాళ మూవీస్  
  • 'భ్రమయుగం'పై అందరిలోను పెరిగిన ఆసక్తి
  • 'సైరన్'కి ప్త్రాత్యేక ఆకర్షణగా కీర్తి సురేశ్ - అనుపమ పరమేశ్వరన్

New Movies Update

ఈ శుక్రవారం థియేటర్ల దగ్గర కాస్త గట్టిగానే సందడి కనిపించనుంది. ఆ జాబితాలో తెలుగుతో పాటు తమిళ అనువాదాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నెల 23వ తేదీన 'సుందరం మాస్టర్' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వైవా హర్ష ప్రధానమైన పాత్రగా ఈ కథ నడుస్తుంది. హీరో రవితేజ నిర్మించిన ఈ సినిమాకి, కల్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించాడు. కమెడియన్ గా తనదైన మార్క్ చూపిస్తూ వచ్చిన అభినవ్ గోమఠం, హీరోగా 'మస్తు షేడ్స్ ఉన్నయ్ రా' సినిమా చేశాడు. తిరుపతిరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాతో, కథానాయికగా వైశాలి పరిచయం కానుంది. మమ్ముట్టి మలయాళంలో చేసిన 'భ్రమయుగం' అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమాను ఇక్కడ సితార బ్యానర్ వారు రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి ఉంది. తమిళంలో జయం రవి హీరోగా చేసిన 'సైరన్' కూడా ఇదే రోజున ఇక్కడి థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. కీర్తి సురేశ్ - అనుపమ పరమేశ్వరన్ కథానాయికలుగా అలరించనున్నారు. తన భార్య మరణానికి కారకులైనవారిపై పగ తీర్చుకునే ఓ అంబులెన్స్ డ్రైవర్ కథ ఇది. ఇక 'సిద్ధార్థ్ రాయ్' .. 'ముఖ్య గమనిక' .. 'రోటి కపడా రొమాన్స్' ఆడియన్స్ ను పలకరించనున్నాయి..

More Telugu News