ఆ రెండు పనులు చేస్తే.. బీజేపీని సగం మంది వీడుతారు: కేజ్రీవాల్
- చౌహాన్, వసుంధర రాజే సొంత పార్టీలు పెట్టుకుంటారన్న ఢిల్లీ సీఎం
- ఈడీ దాడులకు భయపడే ఆ పార్టీలో చేరుతున్నారని వ్యాఖ్య
- పీఎంఎల్ఏ సెక్షన్ 45ను రద్దు చేస్తే బీజేపీ ఖాళీ అవుతుందని వెల్లడి
ఆదివారం కాంగ్రెస్ నేత, లాయర్ అభిషేక్ మను సింఘ్వి నివాసంలో ఏర్పాటు చేసిన లంచ్ మీటింగ్ కు కేజ్రీవాల్ హాజరయ్యారు. ఆప్ మినిస్టర్ అతిషీ కూడా ఈ మీటింగ్ కు హాజరయ్యారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఖర్గే, కేజ్రీవాల్, సింఘ్వి, అతిషీ పాల్గొన్నారు. అంతకుముందు ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ కు కేజ్రీవాల్ మద్దతు తెలిపారు. బీజేపీ కుట్ర రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకమై పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.