నావల్నీ మృతదేహం అప్పగింత వెనక కొనసాగుతున్న హైడ్రామా
- కుటుంబ సభ్యులకు అప్పగించని ప్రభుత్వం
- కొడుకు మృతదేహం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్న నావల్నీ తల్లి
- సంతాపం తెలిపిన వారిని నిర్భంధించిన పోలీసులు
దీంతో నావల్నీ మద్దతుదారులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. తమ లీడర్ ను ప్రెసిడెంట్ పుతినే చంపించాడని, ఎలాంటి సాక్ష్యాలు దొరకకూడదనే డెడ్ బాడీని దాచి పెడుతున్నారని మండిపడుతున్నారు. మరోవైపు, నావల్నీ మరణించారన్న విషయం తెలిసి దేశవ్యాప్తంగా ఆయన మద్దతుదారులు విచారంలో మునిగిపోయారు. వివిధ సిటీలలోని ఆయన స్మారకాల వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హైడ్రామా నెలకొంది. నావల్నీకి సంతాపం తెలపకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నావల్నీకి సంతాపం తెలిపేందుకు ప్రయత్నించిన వారిని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. శని, ఆదివారాలలో దేశవ్యాప్తంగా 230 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నావల్నీ స్మారకాలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్లు స్థానిక మీడియా కథనాలు వెలువరించాయి.