Tirumala: మే నెల కోటా టికెట్ల విడుదల తేదీలను ప్రకటించిన టీటీడీ

  • ఆన్ లైన్ లో శ్రీవారి సేవలు, దర్శనం టికెట్ల జారీ
  • ఫిబ్రవరి 19 నుంచి 27 వరకు వివిధ రకాల టికెట్ల విడుదల
  • ఆన్ లైన్ లోనే భక్తులు బుక్ చేసుకోవాలన్న టీటీడీ
TTD announces month of May quota tickets

తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి గదులకు సంబంధించి మే నెల కోటా టికెట్ల విడుదల తేదీలను టీటీడీ ప్రకటించింది. ఈ టికెట్లను ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాల్సి ఉంటుందని, నకిలీ వెబ్ సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచించింది.

మే నెల కోటా టికెట్ల విడుదల ముఖ్యమైన తేదీలు ఇవే...

ఫిబ్రవరి 19- ఉదయం 10 గంటలకు... శ్రీవారి ఆర్జిత సేవల టికెట్లు విడుదల
ఫిబ్రవరి 21- ఉదయం 10 గంటల వరకు... ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆన్ లైన్ లో నమోదు చేసుకునే అవకాశం
ఫిబ్రవరి 21- మధ్యాహ్నం 12 గంటలకు... లక్కీ డిప్ లో టికెట్ల మంజూరు. టికెట్లు లభించిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాలన్న టీటీడీ

ఫిబ్రవరి 22- ఉదయం 10 గంటలకు... ఆర్జిత బ్రహ్మోత్సవం, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకరణ సేవ వర్చువల్ సేవా టికెట్ల కోటా విడుదల
ఫిబ్రవరి 22- మధ్యాహ్నం 3 గంటలకు... వర్చువల్ సేవలు, వాటి స్లాట్లకు సంబంధించిన కోటా విడుదల

ఫిబ్రవరి 23- ఉదయం 11 గంటలకు... శ్రీవాణి ట్రస్టు టికెట్ల కోటా విడుదల 
ఫిబ్రవరి 23- ఉదయం 10 గంటలకు... అంగప్రదక్షిణం టోకెన్ల విడుదల
ఫిబ్రవరి 23- మధ్యాహ్నం 3 గంటలకు... వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘరోగ పీడితులు శ్రీవారిని దర్శించుకునేందుకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

ఫిబ్రవరి 24- ఉదయం 10 గంటలకు... రూ.300 శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల
ఫిబ్రవరి 24- మధ్యాహ్నం 3 గంటలకు... తిరుపతి, తిరుమలలో వసతి గదుల కోటా టికెట్ల విడుదల

ఫిబ్రవరి 27- ఉదయం 11 గంటలకు... శ్రీవారి సేవా టికెట్ల విడుదల
ఫిబ్రవరి 27- మధ్యాహ్నం 11 గంటలకు... నవనీత సేవా టికెట్ల విడుదల
ఫిబ్రవరి 27- మధ్యాహ్నం 2 గంటలకు పరకామణి సేవా టికెట్ల విడుదల

More Telugu News