27 ఏళ్లు పూర్తిచేసుకున్న ఎన్టీఆర్ ట్రస్ట్.. సిబ్బందికి చంద్రబాబు అభినందనలు

NTR trust completes 27 years Chandrababu wishes staff
  • సిబ్బంది, వలంటీర్లు అంకితభావంతో సేవలందిస్తున్నారని ప్రశంస
  • ఎన్టీఆర్ ఆశయసాధన కోసమే ట్రస్ట్‌ను ఏర్పాటు చేశామన్న చంద్రబాబు
  • అన్ని రంగాల్లోనూ విశేష సేవలు అందిస్తోందన్న టీడీపీ అధినేత
ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ 27 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్పందించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సిబ్బంది, వలంటీర్లకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు.

ఎన్టీఆర్ ఆశయ సాధనకు తాను నెలకొల్పిన ట్రస్ట్ రక్తదానం, ఆరోగ్య సంరక్షణ, విద్య, సాధికారత, జీవనోపాధి రంగాల్లో సేవలందించడంతోపాటు ప్రకృతి విపత్తులో సైతం ప్రజలకు అండగా నిలుస్తోందన్నారు. సిబ్బంది అంకితభావంతో సేవలందిస్తున్నారని ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు.
Go Back to Shorts
NTR Trust
Telugudesam
Chandrababu

More Telugu News