Medaram Jatara: భక్తుల ఇంటి వద్దకే మేడారం జాతర ప్రసాదం

  • ఈ నెల 21 నుంచి మేడారం జాతర
  • భక్తులకు ప్రసాదాన్ని హోమ్ డెలివరీ ఇవ్వనున్న తెలంగాణ ఆర్టీసీ
  • వివరాలు తెలిపిన టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ 
Medaram Jathara Prasadam now available with home delivery

తెలంగాణలో మేడారం జాతర కోలాహలం నెలకొంది. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారంలో సమ్మక్క-సారలమ్మ జాతర జరగనుంది. ఈసారి ప్రత్యేకంగా భక్తులకు అమ్మవార్ల ప్రసాదం ఇంటివద్దకే అందించాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. ఆన్ లైన్, ఆఫ్  లైన్ విధానాల్లో భక్తులు ప్రసాదాన్ని ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. https://rb.gy/q5rj68 వెబ్ లింక్ ద్వారా గానీ, భక్తులు తమకు సమీపంలోని టీఎస్ఆర్టీసీ కార్గో/లాజిస్టిక్స్ కౌంటర్లలో గానీ రూ.299 చెల్లించి మేడారం ప్రసాదాన్ని ముందుగా బుక్ చేసుకోవచ్చు. లేకపోతే, పేటీఎం ఇన్ సైడర్ యాప్ ద్వారా యాప్ ద్వారా కూడా ప్రసాదాన్ని ఆన్ లైన్ లో భక్తులు కొనుగోలు చేయవచ్చు. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు.

More Telugu News