రేపు తెలంగాణ ఎమ్మెల్యేల మేడిగడ్డ పర్యటన... కేసీఆర్ సహా ప్రతి ఎమ్మెల్యేకు లేఖ
- బస్సుల్లో మేడిగడ్డకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ప్రజాప్రతినిధులు
- ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ నుంచి మేడిగడ్డకు బయలుదేరనున్న ప్రజాప్రతినిధులు
- మధ్యాహ్నం మేడిగడ్డను సందర్శించి... సాయంత్రం 5 గంటలకు తిరుగు ప్రయాణం
ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేల మేడిగడ్డ షెడ్యూల్ ఇదే
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ప్రజాప్రతినిధుల మేడిగడ్డ షెడ్యూల్ను వరంగల్ సీపీ, జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా ఎస్పీ మీడియాకు విడుదల చేశారు.
ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో ప్రజాప్రతినిధులు మేడిగడ్డకు బయలుదేరుతారు.
మధ్యాహ్నం 2 గంటలకు మేడిగడ్డ బ్యారేజీకి చేరుకుంటారు.
మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజీని సందర్శిస్తారు.
మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు ముఖ్యమంత్రి.. అధికారులతో రివ్యూ చేస్తారు.
సాయంత్రం 5 గంటలకు మేడిగడ్డ నుంచి హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అవుతారు.
రాత్రి 9.30 గంటలకు ప్రజాప్రతినిధులు హైదరాబాద్కు చేరుకుంటారు.