మామ గారి ఆరోపణలపై రవీంద్ర జడేజా అర్ధాంగి రివాబా ఏమన్నారంటే...!
- ఇటీవల కోడలిపై తీవ్ర ఆరోపణలు చేసిన జడేజా తండ్రి
- ఆమె తమ కుటుంబంలో చిచ్చు పెట్టిందని వ్యాఖ్యలు
- తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన రివాబా
- కుటుంబ వివాదాలపై ప్రశ్నించిన మీడియా
- ఈ కార్యక్రమంలో ఇలాంటివి అడుగుతారా? అంటూ అసహనం
జడేజా భార్య రివాబా ప్రస్తుతం గుజరాత్ లోని జామ్ నగర్ (నార్త్) నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న రివాబాను మీడియా కుటుంబ వివాదాలపై ప్రశ్నించింది.
అందుకు రివాబా తీవ్రంగా స్పందించారు. ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం ఏంటి? మీరు అడుగుతున్నది ఏంటి? అని ఆ విలేకరిపై అసహనం ప్రదర్శించారు. మా కుటుంబ విషయాలు తెలుసుకోవాలనుకుంటే నన్ను విడిగా అడగండి... చెబుతాను... ఇక్కడ మాత్రం ఇలాంటివి అడగొద్దు అని రివాబా కరాఖండీగా చెప్పేశారు.