Telugu: అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో తెలుగులో మాట్లాడుకున్న ఇద్దరు క్రికెటర్లు... వీడియో వైరల్

  • నిన్న దక్షిణాఫ్రికాలో అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్
  • ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్
  • భారత జట్టులో ఇద్దరు హైదరాబాదీ ఆటగాళ్లు
  • మ్యాచ్ సందర్భంగా తెలుగులో మాట్లాడుకున్న వైనం
India Under 19 cricketers talking in Telugu video gone viral

దక్షిణాఫ్రికాలోని బెనోనీలో నిన్న భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ ఓడిపోయింది. కాగా, ఈ మ్యాచ్ కు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇద్దరు క్రికెటర్లు తెలుగులో మాట్లాడుకోవడం ఈ వీడియోలో గమనించవచ్చు. 

భారత జట్టు వికెట్ కీపర్ అవనీశ్ రావు, బౌలర్ మురుగన్ అభిషేక్ ఇద్దరూ హైదరాబాద్ వాళ్లే. అభిషేక్ బౌలింగ్ చేస్తున్న సమయంలో వికెట్ల వెనకాల ఉన్న అవనీశ్ రావు అతడికి తెలుగులో సూచనలు చేయడం వినిపించింది. ఈ వీడియోను మ్యాచ్ ప్రసారకర్త స్టార్ స్పోర్ట్స్ తెలుగు చానల్ తన సోషల్ మీడియా అకౌంట్లో పంచుకుంది.

More Telugu News