Election Committee: ఏపీ ఎన్నికల కమిటీని ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్

  • ఏపీలో త్వరలో ఎన్నికలు
  • పీసీసీ చీఫ్ షర్మిల చైర్ పర్సన్ గా ఎన్నికల కమిటీ
  • రఘువీరా, కేవీపీ, రుద్రరాజు తదితరులతో కమిటీ
  • ప్రకటన విడుదల చేసిన ఏఐసీసీ 
AICC announces Election Committee for AP

ఏపీలో అన్ని ప్రధాన పార్టీల్లో ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. ఇటీవల షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో ఆ పార్టీలోనూ ఉత్సాహం నెలకొంది. ఈ క్రమంలో, కాంగ్రెస్ హైకమాండ్ నేడు ఏపీ ఎన్నికల కమిటీని ప్రకటించింది. ఈ కమిటీకి పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చైర్ పర్సన్ గా వ్యవహరిస్తారు. ఈ కమిటీలో రఘువీరారెడ్డి, టి.సుబ్బరామిరెడ్డి, పళ్లంరాజు, కేవీపీ రామచంద్రరావు, గిడుగు రుద్రరాజు, శైలజానాథ్, చింతా మోహన్, తులసి రెడ్డి, జేడీ శీలం సహా మొత్తం 20 మంది ఉన్నారు. ఈ మేరకు ఏఐసీసీ నుంచి ప్రకటన వెలువడింది.

More Telugu News