చివరి మూడు టెస్టులపై కోహ్లీ కీలక నిర్ణయం
- ఇంగ్లాండ్ తో సొంత గడ్డపై టెస్ట్ సిరీస్
- తొలి రెండు టెస్టులకు కూడా దూరంగా ఉన్న కోహ్లీ
- కోహ్లీ నిర్ణయాన్ని గౌరవిస్తామన్న జే షా
ప్రస్తుత టెస్ట్ సిరీస్ తొలి రెండు మ్యాచ్ లకు కూడా వ్యక్తిగత కారణాల వల్ల కోహ్లీ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. కోహ్లీ నుంచి క్లారిటీ రాకపోవడం వల్లే చివరి మూడు టెస్టులకు జట్టు ప్రకటన ఆలస్యమయింది. ఇప్పుడు కోహ్లీ తన నిర్ణయాన్ని తెలియజేయడంతో జట్టును ప్రకటించే అవకాశం ఉంది. జడేజా, కేఎల్ రాహుల్ ఫిట్ నెస్ కు సంబంధించి జాతీయ క్రికెట్ అకాడెమీ నుంచి నివేదికలు రావాల్సి ఉంది. గాయం బారిన పడిన శ్రేయస్ అయ్యర్ కి కూడా జట్టులో స్థానం దక్కకపోవచ్చు. సర్ఫరాజ్ ఖాన్ కు అవకాశం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.