జగన్ కంటే అసమర్థ ముఖ్యమంత్రి ఇంకెవరూ ఉండరు: కేవీపీ
- తల్లిని, చెల్లెలిని కూడా సంరక్షించుకోలేని వ్యక్తి జగన్ అని మండిపాటు
- ఏ సీఎం కూడా జగన్ వెళ్లినన్ని సార్లు ఢిల్లీకి వెళ్లలేదని విమర్శ
- ఏపీ అక్రమాల్లో బీజేపీ పెద్దలకు వాటాలు అందుతున్నాయా అని ప్రశ్న
బీజేపీయేతర పాలన ఉన్న రాష్ట్రాల్లో పలువురు మంత్రులను ఈడీ అరెస్ట్ చేసిందని... ఏపీ మంత్రులను మోదీ ప్రభుత్వం ఎందుకు వదిలేసిందని ప్రశ్నించారు. ఏపీలో విచ్చలవిడిగా జరుగుతున్న మద్యం విక్రయాలు, ఇసుక అక్రమాలు కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని నిలదీశారు. ఏపీలో జరుగుతున్న అక్రమాల్లో బీజేపీ పెద్దలకు వాటాలు అందుతున్నాయా? అని అనుమానాలు వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం ఏటీఎంలా వాడుకుంటోందని విమర్శించారు.