Stock Market: వారాన్ని లాభాల్లో ముగించిన స్టాక్ మార్కెట్లు

  • ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకుల్లో కొనసాగిన మార్కెట్లు
  • 167 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 64 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాల్లో ముగించాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి చివరి వరకు మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 167 పాయింట్లు లాభపడి 71,595కి చేరుకుంది. నిఫ్టీ 64 పాయింట్లు పెరిగి 21,782 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.55%), సన్ ఫార్మా (2.20%), ఐసీఐసీఐ బ్యాంక్ (2.20%), యాక్సిస్ బ్యాంక్ (1.69%), బజాజ్ ఫైనాన్స్ (1.19%). 

టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-2.40%), భారతి ఎయిర్ టెల్ (-1.94%), ఎన్టీపీసీ (-1.84%), టాటా స్టీల్ (-1.67%), ఇన్ఫోసిస్ (-1.39%).

More Telugu News