Malladi Vishnu: టీడీపీ ఎమ్మెల్యేలపై మల్లాది విష్ణు ఫైర్

  • స్పీకర్ పై కాగితాలు చించి విసిరేస్తున్నారని మండిపాటు
  • సభలో గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శ
  • 175 సీట్లు గెలవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని వ్యాఖ్య
Malladi Vishnu fires on TDP MLAs

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు సరికాదని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ప్రతిరోజు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి స్పీకర్ మీద కాగితాలు చించి విసిరేస్తున్నారని మండిపడ్డారు. శాసనసభ అంటే వారికి లెక్క లేదని విమర్శించారు. ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల సమస్యలను సభలో లేవనెత్తాలని... కానీ, వారు దాన్ని పట్టించుకోకుండా సభలో గందరగోళం సృష్టిస్తున్నారని చెప్పారు. జగన్ నాయకత్వంలో 175 సీట్లు గెలవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా అధికారం కోసం తహతహలాడుతున్న పార్టీ టీడీపీ అని విమర్శించారు. బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మళ్లీ వైసీపీకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News