Ambati Rambabu: యాత్ర-2లో సన్నివేశాలు నా గుండెను పిండేశాయి: అంబటి రాంబాబు

  • వైఎస్సార్, జగన్ రాజకీయ జీవితంలోని ఘట్టాల ఆధారంగా యాత్ర-2
  • మహి వి రాఘవ్ దర్శకత్వంలో చిత్రం
  • నేడు విడుదల
  • ఎక్స్ లో స్పందించిన మంత్రి అంబటి
Ambati Rambabu talks about Yatra 2 movie

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం, జగన్ ఓదార్పు యాత్ర, కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి పార్టీ స్థాపించడం... ఇలాంటి అంశాల ఆధారంగా తెరకెక్కించిన యాత్ర-2 చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహి వి రాఘవ్ ఈ సినిమాకు దర్శకుడు. త్రీ ఆటమ్ లీవ్స్, వి సెల్యులాయిడ్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. 

ఈ సినిమాను వైసీపీ ప్రజాప్రతినిధులు కూడా వీక్షించినట్టు తెలుస్తోంది. మంత్రి అంబటి రాంబాబు కూడా యాత్ర-2 సినిమాను చూసిన అనంతరం తన స్పందనను సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. మహి దర్శకత్వంలో వచ్చిన యాత్ర-2 చిత్రంలోని ఎమోషనల్ సన్నివేశాలు నా గుండెను పిండేశాయి అంటూ అంబటి ట్వీట్ చేశారు.

More Telugu News