Varsha Bollamma: ఆ హీరోను మళ్లీ కలవనేలేదు: పెళ్లి వార్తలపై స్పందించిన హీరోయిన్

  • చిన్న సినిమాలతో బిజీగా వర్ష బొల్లమ్మ 
  • రేపు రిలీజ్ అవుతున్న 'ఊరుపేరు భైరవకోన'
  • దర్శకత్వం వహించిన వీఐ ఆనంద్
  • పుకార్లను కొట్టిపారేసిన హీరోయిన్  

Varsha Bollamma Special

వర్ష బొల్లమ్మ ఒక వైపున ముఖ్యమైన పాత్రలను చేస్తూనే, మరో వైపున హీరోయిన్ గాను చేస్తూ వెళుతోంది. ఆమె హీరోయిన్ గా చేసిన సినిమాలలో 'మిడిల్ క్లాస్ మెలోడీస్' .. ' స్టాండ్ అప్ రాహుల్' .. ' స్వాతి ముత్యం' సినిమాలు గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకులను పలకరించడానికి 'ఊరు పేరు భైరవకోన' రెడీ అవుతోంది. 

సందీప్ కిషన్ హీరోగా చేసిన ఈ సినిమాకి వీఐ ఆనంద్ దర్శకత్వం వహించాడు. రేపు ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో వర్ష బొల్లమ్మ బిజీగా ఉంది. 'స్వాతిముత్యం' సినిమా తరువాత బెల్లంకొండ గణేశ్ తో ఆమె ప్రేమలో పడినట్టుగా .. పెళ్లి చేసుకోబోతున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ విషయం ప్రస్తావనకు రావడంతో ఆమె స్పందించింది.

"సాధారణంగా ఒక హీరో - ఒక హీరోయిన్ ఎక్కడైనా కలిసి కనిపిస్తే, వాళ్లిద్దరిని గురించిన పుకార్లు షికారు చేస్తుంటాయి. కానీ నా విషయంలో మరీ ఆశ్చర్యం. ఆ సినిమా తరువాత గణేశ్ ను నేను మళ్లీ కలిసిందే లేదు .. అయినా పుట్టించేశారు. ఎవరు ఎందుకు ఈ పుకార్లను లేపుతారో తెలియదుగానీ, వాటిని అడ్డుకోవడం కష్టమే" అని చెప్పింది.

More Telugu News